ఊరి నడిబొడ్డున డంపింగ్ యార్డ్...
– మండల కేంద్రంలో ఇదేమి స్వచ్ఛాంధ్ర...
– ముక్కులు మూసుకుంటున్న గ్రామస్తులు...
– పాఠశాలలు, అంగన్వాడీలతో పాటు గహాల్లో ప్రజల ఇక్కట్లు
– చివరకు మూగజీవాలు తాగే చెరువుల్లో కూడా వ్యర్ధాలు...
జనసముద్రం న్యూస్ గుడివాడ నియోజకవర్గం ప్రతినిధి. సుబ్రహ్మణ్యం. ఆగస్టు.11.
ఊరి నడిబొడ్డున డంపింగ్ యార్డ్తో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో ఊరి బయట ఉండే డంపింగ్ యార్డును గ్రామ నడిబొడ్డున డంపింగ్ యార్డును నిర్వహిస్తున్న ఇదేమి స్వచ్ఛాంధ్ర అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. భోజనం చేయాలన్నా ముక్కులు మూసుకుని తినవలసిన దుస్థితి దాపురించిందని వాపోతున్నారు. వ్యర్ధాలను కాల్చేటపుడు వచ్చే పొగతో ఊపిరి తిత్తుల వ్యాధులు దాపురిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్వాడీ, గహాల్లో ప్రజల ఇక్కట్లు అధికారులకు కనబడటం లేదదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు మూగజీవాలను సైతం వదలకుండా అవి తాగే చెరువుల్లో కూడా వ్యర్ధాలతో పూడ్చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా...పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇప్పటికైనా ఈ డంపింగ్ యార్డ్ను గతంలో ఊరి బయట నిర్వహించే విధంగానే మార్పు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేని పక్షంలో పోరాట బాట పడతామని చెప్పారు.




