తెలంగాణ వార్తలు
సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన డివిజన్ అధ్యక్షుల ఎన్నిక
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఎస్సీ సెల్ నూతన అధ్యక్షులను ఎన్నుకున్నారు. కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ అసెంబ్లీ న
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఎస్సీ సెల్ నూతన అధ్యక్షులను ఎన్నుకున్నారు. కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఆదం సంతోష్ కుమార్ నాయకత్వంలో, కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ దాసరి శ్యామ్ సుందర్, డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్ ల ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ అధ్యక్షులుగా చింతల రాజేందర్ (బబ్లూ) ఎన్నికయ్యారు.
ఇక 8 డివిజన్లకు నూతన అధ్యక్షులుగా సీతాఫల్మండి డివిజన్ నుంచి కొంకతి ఆశిష్, చిలకలగూడ నుంచి గజుల జై కుమార్, బౌద్ధనగర్ నుంచి చంద్రమోహన్ కాదరి, తార్నాక నుంచి చింతల నరేష్, మేట్టుగూడ నుంచి శామల రమణి, అడ్డగుట్ట నుంచి యశ్వంత్ కుమార్ (యేసు కుమార్), లాలాపేట నుంచి డి. రాజేంద్ర ప్రసాద్, నార్త్ లాలాగూడ డివిజన్ నుంచి జి. అనిల్ కుమార్ లు ఎన్నికయ్యారు. ఎస్సీ వర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నూతన అధ్యక్షులకు నాయకులు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
జీఎస్టీలో ఏఐ: చిరు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా లీకేజీల నివారణ

పన్ను వ్యవస్థలో కృత్రిమ మేధ(AI) వినియోగం పారదర్శకతను పెంచాలి తప్ప, నిబంధనలు పాటించే చిన్న వ్యాపారులను భయపెట్టేలా ఉండకూడదు.
మిగతా చదవండి →హైదరాబాద్ మ్యూజియాల్లో వర్షాకాల ప్రత్యేక ప్రదర్శనలు

నగరంలోని మ్యూజియాల్లో డెక్కన్ హస్తకళలు, అరుదైన హస్తప్రతులతో కూడిన వర్షాకాల ప్రత్యేక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి.
మిగతా చదవండి →పాఠశాల విద్యార్థులకు జానపద కళలపై శిక్షణ: బుర్రకథ, పేరిణి మెలకువలు నేర్చుకుంటున్న బాలలు

తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు చేరవేసే లక్ష్యంతో నగరంలోని విద్యార్థులకు ప్రత్యేక జానపద కళల వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు.
మిగతా చదవండి →హైదరాబాద్లో వైభవంగా తెలుగు సాహిత్య సదస్సు.. కొత్త కవితలు, అనువాదాలపై చర్చ

నగరంలో జరిగిన తెలుగు సాహిత్య సదస్సులో నూతన కవితా ప్రక్రియలు, ఇతర భాషల నుంచి అనువాదాలపై ప్రముఖ కవులు, రచయితలు విస్తృతంగా చర్చించారు.
మిగతా చదవండి →