ముఖ్య ప్రకటన

గమనిక: ఈ వెబ్‌సైట్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. మేము కేవలం టెస్టింగ్ (పరీక్షల) ప్రయోజనాల కోసం మాత్రమే లైవ్ న్యూస్ నడుపుతున్నాము — దయచేసి ఇందులో ఉన్న ఏదైనా తప్పు లేదా అసంబద్ధమైన సమాచారాన్ని విస్మరించండి. మా ఈ-పేపర్ (ePaper) మరియు RNI రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

బుధవారం12 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:58 amసూర్యాస్తమయం 6:44 pm

బుధవారం

12 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:58 am

సూర్యాస్తమయం 6:44 pm

SENSEX78,154-0.54%
NIFTY24,472-0.62%
హైదరాబాద్ 22K₹1,45,034/10g+4.35%
హైదరాబాద్ 24K₹1,58,219/10g+4.35%
వెండి₹2,14,793/kg+5.51%

సాంస్కృతికం

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి: మాజీమంత్రి సముద్రాల వేణుగోపాలచారి

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి *మాజీమంత్రి సముద్రాల వేణుగోపాలచారి హైదరాబాద్, ట్రైనెట్, న్యూస్ 11: తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని మాజీ మంత్రి సముద్ర

Staff Reporter11 August 2026, 3:59 PMtrinetnews.com
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి: మాజీమంత్రి సముద్రాల వేణుగోపాలచారి

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి

*మాజీమంత్రి సముద్రాల వేణుగోపాలచారి

హైదరాబాద్, ట్రైనెట్, న్యూస్ 11: తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. ఉష మ్యూజిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ మల్లాది ఉషారాణి పుట్టినరోజు సందర్భంగా "సకల కళల సమ్మేళనం" కార్యక్రమాన్ని

చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ ప్రధాన వేదికలో వైభవంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సముద్రాల వేణుగోపాల చారి పాల్గొని వంశీ సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ గాయకుడు త్రినాధరావు, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ తో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉష మ్యూజిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ లక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సంప్రదాయ కళలు, కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సభకు ముందు మల్లాది ఉష రాణి నిర్వహణలో ప్రముఖ గాయనీ, గాయకులచే సినీ, గీతాలు, భక్తి సంగీత కళాకారులచే అన్నమాచార్య సంకీర్తనలతో పాటు జానపద కోలాటం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మల్లాది విష్ణుకుమార్ పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

Facebook𝕏 XWhatsAppTelegram

సోషల్ మీడియాలో వార్త ఫోటో మరియు సారాంశం ప్రివ్యూ‌తో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఊరి నడిబొడ్డున డంపింగ్‌ యార్డ్‌... ముక్కులు మూసుకుంటున్న గ్రామస్తులు

ఊరి నడిబొడ్డున డంపింగ్‌ యార్డ్‌... ముక్కులు మూసుకుంటున్న గ్రామస్తులు

ఊరి నడిబొడ్డున డంపింగ్‌ యార్డ్‌... – మండల కేంద్రంలో ఇదేమి స్వచ్ఛాంధ్ర... – ముక్కులు మూసుకుంటున్న గ్రామస్తులు... – పాఠశాలలు, అంగన్‌వాడీలతో పాటు గహాల్లో ప్రజల ఇక్కట్లు – చివరకు

మిగతా చదవండి →

మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందజేసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందజేసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

వెల్దండ మండలం, చేర్కూర్ గ్రామపంచాయతీకి చెందిన గుదే రాములు కుమారుడు మహేష్ ఇటీవల మృతి చెందగా, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించార

మిగతా చదవండి →