హైదరాబాద్, ఆగస్టు 13 ట్రైనేట్ న్యూస్ :
మేడ్చల్ - మల్కాజిగిరి సిపి చేసిన వాక్యాలు సరైనవి కావనీ, తన వ్యాఖ్య లను వెనక్కి తీసుకోవాల ని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లె పల్లి స్వామి గౌడ్ అన్నారు. ఉస్మా నియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలే కరులు సమావేశంలో స్వామి గౌడ్ మాట్లాడుతూ..నిన్న ఓ న్యూస్ లో, సో షల్ మీడియా ద్వారా వైరల్ అయిన ఒక పోస్టులో మేడ్చల్ - మల్కాజ్ గిరి సిపి బడుగుల సుమ తి ఎవరైనా విద్యాసంస్థలోకి విద్యా ర్థి సంఘాలు, ప్రజా సంఘాలు మరి యు జర్నలిస్టులు ఎవరైనా వెళ్లి ఫో టోలు, వీడియోలు తీస్తే వారిపై చట్టప రమైన చర్యలు తీసుకుంటా మని అనడ మంటే ప్రశ్నించే గొంతు కలను అణి చివేసే విధంగా సిపి గారు స్టేట్మెంట్ ఇవ్వడం చా లా బాధాకరమైన విషయం అన్నారు. పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల ను కాలరాసే విధంగా ఉందని ఆయన ధ్వజ మెత్తారు. అధిక డొనేషన్లతో, అధిక ఫీజు లు, స్పెషల్ ఫీజుల పేరుతో పేద మధ్యత రగతి విద్యార్థుల కుటుంబాలను దోపిడీ చేస్తున్న విద్య సంస్థలపైన మల్కాజిగిరి సిపి సుమతి పీడి యాక్ట్ కేసులు పెట్టవల సింది పోయి ప్రశ్నించే విద్యార్థి సంఘా లు, ప్రజా సంఘాలు, జర్నలిస్టుల పైన కేసులు పెడతాం అనడం చాలా హాస్యా స్పదకంగా ఉందాన్ని స్వామి గౌడ్ పేర్కొ న్నారు. పర్మిషన్ లేని విద్యాసంస్థల పైన ఒక బ్రాంచ్ పేరుతో పలు రకాల బ్రాంచు లను నడిపిస్తు, ర్యాంకుల పేరుతో ఒత్తి డి చేస్తూ, కనీస వసతులు లేకుండా, సరై న పర్మిషన్లు లేకుండ విద్యాసంస్థలను నడిపిస్తు ఎంతో మంది విద్యార్థుల ఆత్మ హత్యలకు, హత్యలకు కారణమైన నా రాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల పైన ఎన్ని పీడీ యాక్ట్ కేసులు పెడతారా ? అని మల్కాజిగిరి సిపి చెప్పాలని బొల్లె పల్లి స్వామి గౌడ్ ప్రశ్నించారు. ఇప్పటికై నా సిపి విద్యా సంస్థల యజమాన్యాల ఒకరి వర్షన్ వినడం సరికాదని విద్యార్థి సంఘాలను, ప్రజా సంఘాలను , జర్నలి స్టులను, విద్యార్థుల తల్లిదండ్రులను పిలి పించుకొని చర్చలు చేస్తే విద్యాసంస్థల యొక్క నిజస్వరూపం, వారి దోపిడి, అరాచకాలు అన్ని బయటికి వస్తాయని అప్పుడు విద్యా సంస్థలపైన పీడి యాక్ట్ కేసులు పెడితే మీకు సభ్య సమాజం మొత్తం అభినందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ, బిసి జేఏ సీ నాయకులు గుండు కరుణాకర్, మల్లే ష్, శ్రవణ్, రాజు, ఆకాష్, జెలెందర్, రమే ష్, మహేష్, రాంబాబు, శేఖర్, తదితరు లు పాల్గొన్నారు.





