చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 24: గోల్డెన్ స్టార్ ది యూత్ కల్చరల్ ఆర్గనైజేషన్, జంట నగరాల సాంస్కృతిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ మిమిక్రీ కళాకారులు 'స్వరముఖి' శ్రీ చంద్రముఖి చంద్రశేఖర్ మిమిక్రీ రంగంలో 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 'స్వర్ణ కంకణ బహుకరణ' మహోత్సవ సభ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గాన సభ (మెయిన్ హాల్ లో నిర్వహించారు . సంస్థ అధ్యక్షుడు బింగి సురేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి హర్యానా పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ మధుసూదనా చారి,
ప్రముఖ సినీ నటులు బాబు మోహన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రముఖి చంద్రశేఖర్ కు స్వర్ణ కంకణం
బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
చంద్రముఖి చంద్రశేఖర్ మిమిక్రీ రంగానికి చేసిన సేవలు అపారమైనవని కొనియాడారు. సభకు ముందు గాయనీ, గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.








