చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 13 :
కళాబంధు' కొప్పరపు వెంకటరావు జన్మదినం సందర్భంగా శ్రీనటరాజ గాన కళా వేదిక ఆధ్వర్యంలో "అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు..." పేరిట 94వ సినీ సంగీత విభావరీ చిక్కడపల్లిలోని శ్రీత్యాగరాయ గానసభ, 'కళా వేంకట దీక్షితులు కళావేదిక'లో నిర్వహించారు . ఈ సందర్భంగా కుమారి బుర్రా సహస్రచే ప్రత్యేక నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం సమాజంలోని సేవలందిస్తున్న ఆదర్శ దంపతులకు పాండురంగ శర్మ, ఎం.వి.బి.లక్ష్మి, దంటు సుబ్రహ్మణ్యం, నాగలక్ష్మి,
కొప్పరపు వెంకటరావు, నాగలక్ష్మి
ఆదర్శ దంపతులకు ఆత్మీయ సత్కారం చేశారు. కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా అధ్యక్షులు, శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, డాక్టర్ మల్లేపూల వెంకటరమణ,
చంద్రశేఖర రావు జి.ఎస్.ఎన్. మూర్తి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నటరాజ గానకళా వేదిక అనేక విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. గాయనీ, గాయకులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సభకు ముందు గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.






