ఆత్మసాక్షి ప్రతి మనిషి చేసే పని తప్పో ఒప్పో చెప్పేది ఆత్మసాక్షి, ప్రపంచానికి తెలియకపోయినా మనసుకు మాత్రం అన్నీ తెలుసు. చీకట్లో చేసిన తప్పు చరిత్రలో కనిపించకపోవచ్చు, కానీ మన అంతరంగంలో అది చెరిగిపోని మచ్చగా మిగులుతుంది. తెలిసీ తప్పు చేయడం అంటే తనని తాను మోసం చేసుకోవడమే, ఇతరులను మభ్యపెట్టగలిగినా మనసును మాత్రం మభ్యపెట్టలేం. అబద్ధంతో గెలిచిన విజయం ఎప్పటికీ నిజమైన గెలుపు కాదు, ధర్మాన్ని వదిలి సంపాదించినదేదైనా మనశ్శాంతిని మాత్రం ఇవ్వదు. ఆత్మసాక్షిని చంపి జీవిస్తే బయట నవ్వినా లోపల బాధే, తప్పు తెలిసిన క్షణంలోనే తిరిగి సరిదిద్దుకోవడం గొప్పతనం. దేవుడిని ఎన్నిసార్లు ప్రార్థించినా మనసులోని తప్పును దాచలేం, ధర్మం మన అడుగుల్లో ఉంటేనే భగవంతుని కృప మన వెంట నడుస్తుంది.
రచన : కె.మురళీమోహన్ రాజు, నెల్లూరు. చరవాణి : 9866179385




