హైదరాబాద్, ట్రైనెట్ ఆగస్టు 12:
కళా, సంస్కృతి, సంగీత ప్రోత్సాహమే ధ్యేయంగా సేవలందిస్తున్న శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలు చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో "నవరాగాలు - సీజన్ 50" పేరిట సంగీత విభావరి
నిర్వహించారు. శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ నిర్వాహకులు ముక్కంటి ఈశ్వర రావు నిర్వహణలో గాయని గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కొలేటి దామోదర్ గుప్తా, టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా , సుధాకర్ గందే
పాల్గొని గాయనీ ,గాయకులను అభినందించారు.త్సవ వేడుకలు






