చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 23 :
శ్రీమయూరి నృత్యాలయం సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో "భావయేమి గోపాలం" - శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ ప్రధాన వేదికలో వైభవంగా నిర్వహించారు.
కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు ఆర్.ఎస్.ఎస్. రామ్ కుమార్ నేతృత్వం వహించగా, నాట్య కిన్నెర నందిత రాజనాల ప్రదర్శనలు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం
నాట్య గురువులకు 'నాట్య కీర్తి' బిరుదుతో ఘనంగా సత్కరించారు. ప్రతిభ కనబరిచిన నృత్యాలయం విద్యార్థులకు 'నాట్య లహరి' పురస్కారాలను అందజేశారు.








