చండూరు సుజాతకు "వంశీ మహానంది సంగీత పురస్కారం" ప్రధానం.
అలరించిన వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళనంలో 55 కీర్తనల ఏకగళ గానం.
హైదరాబాద్, ట్రైనెట్, ఆగస్టు 12: "సంకీర్తనా సుధావాహిని" చండూరు సుజాత సమర్పణలో "వివిధ వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళనం" శ్రీ త్యాగరాయ గానసభలోని కళా వెంకట దీక్షితులు కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంశీ సంస్థ వ్యవస్థాపకులు వంశీ రామరాజు, ప్రముఖ గాయకుడు డాక్టర్ త్రినాథ్ రావు, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ, గాయని లక్ష్మి శాంతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చండూరు సుజాత 55 కీర్తనలను ఏకగళంతో నిర్విరామంగా గానం చేశారు. అనంతరం చండూరు సుజాతకు "వంశీ మహానంది సంగీత పురస్కారం-2026" ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.






