చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ 15: యువత దేశభక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలని పేర్కొన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు త్రినాథరావు, ప్రముఖ కవులు రఘుశ్రీ, మిద్దె సురేష్, ఫోటోగ్రాఫర్ సుధీర్, గానసభ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





