Chief Editor: Rapolu Venkatehwarlu

Change edition

Tuesday25 August 2026

HyderabadSunrise 6:01 amSunset 6:35 pm

Tuesday

25 August 2026

Hyderabad

Sunrise 6:01 am

Sunset 6:35 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
HYD 22K₹1,53,231/10g+3.58%
HYD 24K₹1,67,161/10g+3.58%
SILVER₹2,24,745/kg-0.27%

Telangana

సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన డివిజన్ అధ్యక్షుల ఎన్నిక

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఎస్సీ సెల్ నూతన అధ్యక్షులను ఎన్నుకున్నారు. కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ అసెంబ్లీ న

Staff Reporter8 August 2026, 3:52 PM32 viewstrinetnews.com

Share this story

Share link keeps your language (?lang=)

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఎస్సీ సెల్ నూతన అధ్యక్షులను ఎన్నుకున్నారు. కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదం సంతోష్ కుమార్ నాయకత్వంలో, కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ దాసరి శ్యామ్ సుందర్, డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్ ల ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ అధ్యక్షులుగా చింతల రాజేందర్ (బబ్లూ) ఎన్నికయ్యారు.

ఇక 8 డివిజన్లకు నూతన అధ్యక్షులుగా సీతాఫల్‌మండి డివిజన్ నుంచి కొంకతి ఆశిష్, చిలకలగూడ నుంచి గజుల జై కుమార్, బౌద్ధనగర్ నుంచి చంద్రమోహన్ కాదరి, తార్నాక నుంచి చింతల నరేష్, మేట్టుగూడ నుంచి శామల రమణి, అడ్డగుట్ట నుంచి యశ్వంత్ కుమార్ (యేసు కుమార్), లాలాపేట నుంచి డి. రాజేంద్ర ప్రసాద్, నార్త్ లాలాగూడ డివిజన్ నుంచి జి. అనిల్ కుమార్ లు ఎన్నికయ్యారు. ఎస్సీ వర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నూతన అధ్యక్షులకు నాయకులు పిలుపునిచ్చారు.

Also read