హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్12:
ఏ సమస్యకు గత ప్రభుత్వం కారణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. ఈ 22ఏ పై శనివారం అసెంబ్లీలో మాట్లాడతానని అన్నారు. శనివారం అసెంబ్లీ వద్ద విలేకర్లతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల భూదందాల భాగోతం బహిర్గతం చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రభుత్వ భూముల్లో వెంచర్స్ చేశారని విమర్శించారు. వాటిని నిషేధిత జాబితాలో పెట్టాలని కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. భూబకాసురులు మేం కాదని.. గత పదేళ్ల పాలిన
నాయకులే దోచుకున్నారంటూ
ఆరోపించారు. ఈ 22ఏలో కోటి16 లక్షల ఎకరాలు ఉన్నాయనేది అబద్ధమని స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా జరిగిన తప్పుల వల్లే నిషేధిత జాబితాలో భూములు ఉన్నాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.





