తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం – మాస్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా పద్మారావునగర్లోని స్కందగిరి హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ M.N. రావు గారు ఆధ్వర్యం వహించి, పెద్ద సంఖ్యలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలగూడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు హాజరై మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రోత్సహించారు.







