హైదరాబాద్, అంబర్ పేట్, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :
అంబర్ పేట్ నియోజకవర్గంలోని దుర్గ నగర్ లోని దుర్గ ఆలయం 20వ వార్షికోత్సవాలు సందర్భంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారుడు వి. హనుమంత రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు పార్టీకి, ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ రెడ్డి,
కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి నరేందర్ నేత, దిలీప్ కుమార్ నేత, గడ్డం శ్రీధర్ గౌడ్ , గోపాల్ తదితరులు పాల్గొన్నారు.





