హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 20 :
శ్రీ త్యాగరాయ గానసభ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో "ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో" భాగంగా నిత్యఅన్నదాత, అన్నపూర్ణ డోక్కా సీతమ్మ యాదిలో సభ శ్రీ
త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్షనేత
సిరికొండ మధుసూదనాచారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ, అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ అని కొనియాడారు.
భారతీయ సాంప్రదాయంలో అన్నదానానికి మించిన దానంలేదని విశ్వసించి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా ‘అతిథి దేవోభవ‘ అన్నపదానికి ఉదాహరణగా నిలిచినవ్యక్తి డొక్కా సీతమ్మ అని పేర్కొన్నారు. శ్రీత్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా వి.ఎస్. జనార్దన్ మూర్తి అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. మహనీయులను చరితను భావితరాలకు అందించడానికి గానసభ ఆధ్వర్యంలో వారి జయంతి వర్ధంతి వేడుకలను ఎందరో మహానుభావుల పేరిట నిర్వహిస్తున్నట్లు తెలిపారు
కార్యక్రమంలో
సీనియర్ పత్రికేయులు
జయసూర్య, సంఘసేవకులు లయన్ డాక్టర్ జి.కె. రమణ, గానసభ సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి చక్రపాణి,
కళా శారదాదీక్షితులు, శ్రీత్యాగరాయ గానసభ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.








