సాహిత్యం చూడకుండా ట్రాక్స్పై పాటలు పాడే గాయనీ గాయకులకు ప్రత్యేక వేదిక
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7: భూపతి మ్యూజికల్స్ ఆధ్వర్యంలో, శ్రీ భూపతి కృష్ణకుమార్ నిర్వహణలో తెలుగు, హిందీ సినీ గీతాలతో ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నారు. సాహిత్యం చూడకుండా ట్రాక్స్పై తెలుగు, హిందీ సినీ గీతాలు పాడగల గాయనీ గాయకులకు ‘స్వాగతం–సుస్వాగతం’ అంటూ నిర్వాహకులు ఆహ్వానం పలికారు.
సంగీతంపై ఆసక్తి, ప్రతిభ కలిగిన గాయనీ గాయకులకు తమ గాన ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం మంచి వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. పాత, కొత్త తెలుగు మరియు హిందీ సినీ గీతాలతో సంగీత ప్రియులను అలరించేలా కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 7న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలోని శ్రీ కళా లలిత కళావేదికలో కార్యక్రమం జరగనుంది. సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. అందరూ ఆహ్వానితులేనని తెలిపారు.






