హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7:
తెలంగాణ అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్చ మధ్యలో చైర్లో ఉండగానే భావోద్వేగురై
కంటతడి పెట్టారు. ఉదయం అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మధ్యాహ్నం సభలో చర్చ కొనసాగింది. శాసన సభాపతి అని చూడకుండా అసభ్య పదజాలంతో దూషించిన తాతా మధు శాసనమండలి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ,సహా పలువురు మంత్రులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సభాపతికి జరిగిన అవమానం సభ్య సమాజానికి జరిగిన అవమానమని అన్నారు. నోటితో పలకరానటువంటి భాష వాడిన తాతా మధును డిస్మిస్ చేయాలని కోరారు. ఇక బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, తాతా మధు వాడిన భాషను బీజేపీ ఖండిస్తోందని అన్నారు. స్పీకర్ పై అసభ్యకర భాషను వాడిన సభ్యుడిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. ఈ క్రమంలోనే సభ కొనసాగుతున్న సమయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.





