ట్రై నెట్ న్యూస్, సెప్టెంబరు05/:
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామంలో శనివారం రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏఏపిసీ ఛైర్మన్ సౌజన్యంతో ఉపాధ్యాయ దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కురుమిళ్ళ కవితా శ్రీనివాస్, గ్రామ ఉపసర్పంచ్ కచ్చిగళ్ళ మహేందర్, పాఠశాల చైర్మన్ బొడ్డుపల్లి రేణుక మరియు వికలాంగుల హెల్పింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు సింగారం రమేష్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులందరికీ పూలు మరియు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు మరియు అతిధులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి భారత దేశ చరిత్రను మార్చవచ్చని తెలిపారు.విద్య అన్నిటికి మూలం అని జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలని అదే విధంగా బాగా చదివి విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించారు.





