ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు09:
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో బుధవారం రోజు నీడ్(NEED)స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం మాట్లాడుతూ నేటి విద్యార్థులే తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి ఉన్నత స్థానం చేరుకున్న తర్వాత వారి బాగోగులను చూసుకునే బాధ్యత విద్యార్థులదేనని వారే తల్లిదండ్రులకు, దేశానికి నిజమైన సంపదని అన్నారు. స్థానిక సర్పంచ్ బండ రమా విజయ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ ఇక ప్రతి సంవత్సరం మన పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్యను పెంచడానికి ప్రధాన పాత్ర పోషిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మిర్యాల దామోదర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత దర్శనం వెంకన్న (తెలుగు ఉపాధ్యాయులు)ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరియు ఉపాధ్యాయులు, అలాగే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను మరియు ఉపాధ్యాయులను, అంగన్వాడీ టీచర్ పుష్పలతను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాటిమట్ల ఉపాధ్యాయ ఉపాధ్యాయిని బృందం ఎం లింగమల్లు,జి వెంకటేశ్వర్లు,బండారు మల్లయ్య,వంగూరి యాదయ్య,పిడి చిరుమర్తి యాదయ్య,ఎర్ర శంకర్, తిరుపతి నాయక్,వి కృష్ణవేణి, స్కోప్ స్వచ్ఛంద సంస్థ మండల కోఆర్డినేటర్ కురిమేటి యాదయ్య,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. ప్రవీణ్ కుమార్,ఉపాధ్యాయిని వినీత,విద్యార్థినీ విద్యార్థులు, స్కావెంజర్ యాదయ్య పాల్గొన్నారు.






