\హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 18:
వినాయకుడు..సర్వదేవతా స్వరూపుడు అని సమీకృత అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక సారస్వత సంఘం వ్యవస్థా పక అధ్యక్షులు సంసృతిరత్న డా.కె. ధర్మారావు అన్నారు. బర్కత్ పురలోని సంస్థ కార్యాల యంలో ఇట్ క్లా, ఫాస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నా యి. ఈ సందర్భంగా వినాయకుడికి ధర్మారావు ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛమైన మనసుతో, మంచి హృద యంతో శ్రీ గణపతిని ఆరాధిస్తే, ఆయన మన ప్రతి మంచి కార్యాన్ని విజయవం తం చేసి, అన్ని విఘ్నాలను తొలగిస్తా డని తెలిపారు. సమస్త విఘ్నాలను తొల గించి, శుభాలను చేకూర్చే ప్రథమ పూజ్యుడు మన గణపతి అని, ఏ పూజ, ఏ కార్యం ప్రారం భించినా ముందుగా వినాయ కుడిని స్మరించుకోవడం మన సనాతన సంప్రదాయం, ఆయన రూపం, గుణాలు అన్నీ మంగళ కరమైనవే అన్నా రు. ఈ కార్యక్ర మంలో సంస్థల సభ్యులు, తదిత రులు వినాయకుని పూజలో పాల్గొన్నారు.





