విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసిన విక్రమ్ నాథ్
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్ 17:
భారతదేశాన్ని అభివృద్ధి దిశగా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకెళ్తున్నారన్నారని రాష్ట్రీయ అమిత్ షా యువ సంఘటన్ (ఆర్ఏఎస్వై ఎస్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్ నాథ్ అన్నారు. ప్రధాని నిర్ణయాలతో 25 ఏళ్లలో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం నగరం లో ప్రధాని మోదీ 76వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు నిత్య అవసర వస్తువుల్ని పంపిణీ చేశారు. అదే విధంగా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను విక్రమ్ నాథ్ అందజేశారు. అనంతరం విక్రమ్ నాథ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీని చూసి దేశం గర్వపడుతోందని ఆయన అన్నారు. దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని వివరించారు. భేటీ భాచావో… భేటీ పడావో .. ఉజ్వల సహా తదితర పథకాల ద్వారా మహిళా సాధికారతకు సాధ్యమవుతుందన్నారు.





