22వ సంవత్సరం వినాయక ఉత్సవాలు ఘనంగా
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17:
టీం యువ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 22వ సంవత్సరం వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని చిలకలగూడ పోలీస్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ముఖ్య అతిథిగా సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో కలిసిమెలిసి జరుపుకోవాలని సూచించారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మండప నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రమశిక్షణతో ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు.
వినాయక మండపాల నిర్వహణకు, శాంతిభద్రతల పరిరక్షణకు చిలకలగూడ పోలీసుల పూర్తి సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీం యువ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్, సభ్యులు బాలు, రవికాంత్, దుర్గ, చండు, శరత్, శ్రీధర్ రెడ్డి, సన్నీ, సాయి, తేజ, శన్ముఖ్, శ్రీకర్, వెడ్కంత్, అశ్విన్, యజ్ఞదత్ తదితరులు పాల్గొన్నారు.





