హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 14:
జూనియర్ మనోరంజన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ (JMFA-TRT) ఆధ్వర్యంలో 30వ వార్షికోత్సవ గణేశ్ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ విచ్చేసి భారీ గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాలుగా స్నేహం, ఐక్యత, సంప్రదాయాలను కొనసాగిస్తూ వస్తున్న అసోసియేషన్ సభ్యులు ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
సర్వలోకాలకు అధిపతి వినాయకుడని పేర్కొన్నారు. తొలి పూజలు అందుకునే
వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని వాసన్న ఆకాంక్షించారు. ఉత్సవాల్లో పాల్గొంటున్న భక్తులకు, కార్యక్రమాల నిర్వహణకు సహకరిస్తున్న సభ్యులు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.







