హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 12:
తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీపై టీపీసీసీ మీడియా , కమ్యూనికేషన్ మాజీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. మాక్ అసెంబ్లీపై మార్క్ సెటైర్లు వేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించిన సామ రామ్మోహన్ రెడ్డి.. బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీని కామెడీ స్కిట్తో పోల్చారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ నేతలు డ్రామాలకు తప్ప దేనికీ పనికిరారంటూ విమర్శలు గుప్పించారు. మాక్ అసెంబ్లీలో పేరుతో ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు





