ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం10 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:22 pm

గురువారం

10 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:22 pm

SENSEX74,743-2.32%
NIFTY23,421-2.00%
హైదరాబాద్ 22K₹1,45,595/10g-0.89%
హైదరాబాద్ 24K₹1,58,831/10g-0.89%
వెండి₹2,24,890/kg+1.52%

తాజా వార్తలు

కాళోజీ తెలంగాణ భాషా వైతాళికుడు: సిరికొండ మధుసూదనాచారి ..శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి

తెలంగాణ గడ్డను, యాసను అమితంగా ప్రేమించిన ప్రజల మనిషి కాళోజీ నారాయణరావు గొప్ప భాషా వైతాళికుడని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించారు.

nagendra10 September 2026, 1:56 AM1 చూసులుtrinetnews.com
కాళోజీ తెలంగాణ భాషా వైతాళికుడు: సిరికొండ మధుసూదనాచారి  ..శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 9:

తెలంగాణ గడ్డను, యాసను అమితంగా ప్రేమించిన ప్రజల మనిషి కాళోజీ నారాయణరావు తెలంగాణ భాషా వైతాళికుడని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు.

శ్రీ త్యాగరాయ గానసభలోని గుండవరపు హనుమంతరావు కళావేదికపై, గానసభ నిర్వహణలో ‘ఎందరో మహానుభావులు’ కార్యక్రమ పరంపరలో భాగంగా ప్రజాకవి కాళోజీ నారాయణ రావు యాదిలో జయంతి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధుసూదనాచారి మాట్లాడుతూ... కాళోజీ మూలాలు మహారాష్ట్ర ప్రాంతమైనప్పటికీ, తెలంగాణ ఓరుగల్లు ప్రాంతంలో స్థిరపడి నాటి నిజాం, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన ఉద్యమశీలి అని గుర్తుచేశారు. స్వాతంత్య్రం అనంతరం కూడా తెలంగాణ ప్రజలపై జరుగుతున్న ఆధిపత్య పోరును నిరసిస్తూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మద్దతుగా నిలిచి భాష, సంస్కృతి పరిరక్షణ కోసం పోరాడిన మహామనీషి అని కొనియాడారు. కాళోజీ భాషకు, సమాజానికి చేసిన నిరుపమాన సేవలకు గుర్తింపుగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నాటి కె.సి.ఆర్. ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా నిర్వహిస్తూ వస్తోందని తెలిపారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి అధ్యక్షత వహించిన ఈ వేదికపై యువ కళావాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ, ప్రముఖ గాయకుడు డాక్టర్ శంకర్ రామిరెడ్డి, గానసభ పాలకవర్గ సభ్యుడు బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఖప్రాయపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నూనెముంతల బుచ్చి రాములు గౌడ్ మృతి చెందగా, వారి కుటుంబాన్ని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బుచ్చి రాములు గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మిగతా చదవండి →

అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

Former Government Whip Gongidi Sunitha Mahender Reddy visited Yemme Kalyan, who is receiving treatment at Apex Hospital in Boduppal following an accident.

మిగతా చదవండి →