హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :
సంగీత మాధురి లలిత సంగీత సేవా సంస్థ, సుదర్శన భారతి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో చివలురి రాజ్యలక్ష్మి, నరసింహాచార్యుల దివ్యాశీస్సులతో, శ్రీనివాస్ కు 'లలిత సంగీత కౌముది' బిరుదు
ప్రధానోత్సవం కార్యక్రమం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గాన సభలోని కళా వెంకట దీక్షితులు కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లలిత గీతాలు మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయని తెలిపారు.
శ్రీనివాస్ కు 'లలిత సంగీత కౌముది బిరుదును ప్రధానం చేయడం అభినందనీయమన్నారు. సభకు
గాయనీ గాయకులు ఆలపించిన లలిత సంగీత విభావరి అలరించాయి. కార్యక్రమంలో
ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా కో-ఆర్డినేటర్
బింగి నరేందర్ గౌడ్, కిన్నెర వెల్ఫేర్ సొసైటీ కిన్నెర నాగ చంద్రికాదేవి,
అపూర్వ ఎంటర్టైనర్స్ అధినేత
బి.ఎం.కె.నాయుడు , రామ్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.






