హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 28:
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ నివాసంలో శుక్రవారం రక్షా బంధనం వేడుకలు సందడిగా జరిగాయి. మోండా మార్కెట్ లోని పద్మారావు గౌడ్ నివాసంలో ఆయన సోదరి శకుంతల రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రక్షా బంధనం సోదర సోదరీ మణుల మధ్య ప్రీమాభిమానాలకు దర్పణం పడుతుందని, విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు చాటాల్సి ఉందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ప్రజలకు రక్షా బంధనం శుభాకాంక్షలు తెలిపారు. పద్మారావు గౌడ్ కుమారులు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్ లకు వారి సోదరీమణులు మనీష, మౌనికలు రాఖీలు కట్టారు.





