హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 27 :
కళా తపస్విని డా. కిరణ్మయి బొనాల శిష్యురాలైన సమ్మోహన కృష్ణ రంగప్రవేశం 'సమ్మోహన కృష్ణ షాద్ తరంగిణి' పేరిట ఈ నెల 29తేదీనసమ్మోహన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భారతీయ విద్యా భవన్ లో నిర్వహిస్తున్నట్లు డా. బోనాల కిరణ్మయి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమ్మోహన కృష్ణ గొప్ప కళా వారసత్వాన్ని కొనసాగిస్తున్న ప్రముఖ నాట్య గురువు పద్మ కళ్యాణ్ మనవరాలు మూడవ తరానికి చెందిన యువ ప్రతిభావంతురాలైన కళాకారిణి అని తెలిపారు. . లయోలా అకాడమీలో
బిబిఏ రెండవ సంవత్సరం చదువుతూ..
విద్య, భరత నాట్యంలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె భరతనాట్యంలో బ్యాచిలర్ డిగ్రీ మొదటి సంవత్సరంలో విజయవంతంగా పూర్తి చేసిందని వివరించారు. సమ్మోహన కృష్ణ సంగీతంలో కూడా విజయవంతంగా కొన్ని కోర్సులు పూర్తి చేసి, ప్రస్తుతం గురువుల (రాధా కృష్ణ) మార్గదర్శకత్వంలో సంగీతంలో బ్యాచిలర్ డిగ్రీ అభ్యసిస్తున్నట్లు తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఆమె ప్రదర్శనలు ఇచ్చి అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుతో పాటు ప్రముఖ సినీ టీవీ నటులు
సి.వి.ఎల్. నరసింహ రావు
యక్షగాన కంఠీరవ గురు డా. పసుమర్తి శేషు బాబు, గ్లోబ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్
డైరెక్టర్ లయన్ డా. సత్యనారాయణ సంఘిశెట్టి పాల్గొంటారని తెలిపారు.






