హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26:
ప్రముఖ రచయిత డా. నిర్మల లక్కరాజు రచించిన 'విశ్వ నియమాలు , విశ్వరహస్యాలు' పార్ట్ - 2' పుస్తకావిష్కరణ సభ
ఆత్మీయ సాంస్కృతిక సమితి
ఆధ్వర్యంలో రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాడ సుబ్రమణ్య ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డా. కొండపల్లి నిహారిరిణి, డా. శ్రీనివాసరావు, డా. రామ శాస్త్రి, వెంకటరమణ శర్మ పాల్గొని ప్రసంగిస్తూ.. లక్కరాజు నిర్మల రచించిన పుస్తకాలు సామాజిక చైతన్యాన్ని నింపాయని పేర్కొన్నారు. సంపుటిలోని విశేషాలను విశ్లేషించారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు





