హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :
ప్రముఖ సంస్థ "శ్యామలాస్ ఈ ఛానల్" వ్యవస్థాపకులు లయన్ డా. బి. శివరామ్, ఎడ్యుకేషనిస్ట్, క్లాసికల్ సింగర్, వీణా ప్లేయర్ బి. శ్యామల ఆధ్వర్యంలో శ్రావణమాస వేడుకలు చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలోని కళా మారుతి కళావేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. రుక్మిణి, సి.హెచ్. సతీష్ కుమార్, కె. సౌజన్య ఉదయ్, పి. సావిత్రి, ఎం. శ్రీనివాస్ , జె. జయప్రద, ఆర్. రేవతి, కె. హరిప్రియ, సుచరిత, అక్షిత, దివ్య, కౌసల్య, లత, సుజాత, రాణి, మాధురి, స్వప్న, స్వేత, ఎ. మాధురి, కె. దివ్య, నివేశ, సారిష, శ్రీనిధి, లక్ష్మి శ్రీకారి, ఎల్. సాన్విక, కె. తనీష శిష్య బృందాలు ప్రదర్శించిన పలు నృత్య, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.






