చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 22: కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ ‘కల్పశ్రీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ ట్రస్ట్’ తమ 37వ వార్షికోత్సవ వేడుకలు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికలో ఘనంగా నిర్వహించారు.
నృత్యోత్సవంలో దక్షిణ భారత దేశానికి చెందిన ప్రముఖ నృత్య కళాకారులు పాల్గొని తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. సాంప్రదాయ కళలను ప్రోత్సహించడం, తరతరాల నాట్య ప్రాశస్త్యాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా ఉత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ నాట్య గురువు వసుమర్తి శేషుబాబు తెలిపారు. అనంతరం కళాకారులను అభినందించి సత్కరించారు











