ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం2 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:29 pm

బుధవారం

2 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:29 pm

SENSEX76,944-0.68%
NIFTY24,056-0.63%
హైదరాబాద్ 22K₹1,41,390/10g-5.86%
హైదరాబాద్ 24K₹1,54,244/10g-5.86%
వెండి₹2,11,579/kg-7.51%

తాజా వార్తలు

మాణికేశ్వరి నగర్‌ లో ఎస్‌ఐఆర్ ఫేజ్–2 హెల్ప్ డెస్క్ ఏర్పాటు..

A special help desk has been established in Manikeshwari Nagar under the leadership of DCC General Secretary Gandikota Kumar to assist voters with SIR Phase-2 queries.

nagendra2 September 2026, 1:00 AM1 చూసులుtrinetnews.com
మాణికేశ్వరి నగర్‌ లో ఎస్‌ఐఆర్ ఫేజ్–2 హెల్ప్ డెస్క్ ఏర్పాటు..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* ఓటర్ల సందేహాల నివృత్తికి ప్రత్యేక కేంద్రం..

* బీఎల్‌ఏ ల పనితీరును పరిశీలించి అవగాహన కల్పించిన గండికోట కుమార్..

తార్నాక, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1:

ఎస్‌ఐఆర్ రెండో దశ (ఫేజ్–2) ప్రక్రియలో భాగంగా సీతాఫల్మండి డివిజన్‌ పరిధిలోని మాణికేశ్వరి నగర్‌ లో డీసీసీ ప్రధాన కార్యదర్శి గండికోట కుమార్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఎస్‌ఐఆర్ ఫేజ్-2 కు సంబంధించి నోటీసులు అందుకున్న ఓటర్లకు అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, అసెంబ్లీ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదం సంతోష్ కుమార్, ఆదేశాల మేరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు గండికోట కుమార్ వెల్లడించారు. ఎస్‌ఐఆర్‌ కు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉన్న ఓటర్లు హెల్ప్ డెస్క్‌ ను సంప్రదించి సహాయం పొందాలని కోరారు. అదేవిధంగా బీఎల్‌ఏల పనితీరును పరిశీలించి, ఎస్‌ఐఆర్ రెండో దశ ప్రక్రియపై వారికి అవసరమైన అవగాహన కల్పించినట్లు గండికోట కుమార్ తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను సులభతరం చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించి, పరామర్శించేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో తనను రెండోసారి గృహనిర్బంధం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు.

మిగతా చదవండి →