* ఓటర్ల సందేహాల నివృత్తికి ప్రత్యేక కేంద్రం..
* బీఎల్ఏ ల పనితీరును పరిశీలించి అవగాహన కల్పించిన గండికోట కుమార్..
తార్నాక, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1:
ఎస్ఐఆర్ రెండో దశ (ఫేజ్–2) ప్రక్రియలో భాగంగా సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని మాణికేశ్వరి నగర్ లో డీసీసీ ప్రధాన కార్యదర్శి గండికోట కుమార్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఎస్ఐఆర్ ఫేజ్-2 కు సంబంధించి నోటీసులు అందుకున్న ఓటర్లకు అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, అసెంబ్లీ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదం సంతోష్ కుమార్, ఆదేశాల మేరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు గండికోట కుమార్ వెల్లడించారు. ఎస్ఐఆర్ కు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉన్న ఓటర్లు హెల్ప్ డెస్క్ ను సంప్రదించి సహాయం పొందాలని కోరారు. అదేవిధంగా బీఎల్ఏల పనితీరును పరిశీలించి, ఎస్ఐఆర్ రెండో దశ ప్రక్రియపై వారికి అవసరమైన అవగాహన కల్పించినట్లు గండికోట కుమార్ తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను సులభతరం చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.





