ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు09:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రానికి ఇతర ప్రాంతం నుంచి పని కోసం వచ్చి, ఇక్కడే ఆత్మకూరు మెయిన్ రోడ్డుపై బీటీ కమ్మరి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న షోలంకి సుభాష్ (46) మృతి చెందడం బాధాకరం.వారి మృతదేహానికి కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు ఉగ్గె నరేష్ , ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నోముల యాదగిరి,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు గట్టు రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించడం జరిగిందని అన్నారు.





