: హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రై నెట్ న్యూస్, ఆగస్టు 24 :
గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి చే శతక నారాయణుడు గా పేర్కొన్న ప్రముఖ జర్నలిస్ట్ హాస్యావధాని శంకర నారాయణ రచించిన మరో శతకం అరణ్య శతకం ఆవిష్కరణ సమావేశం శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం తో గాన సభ నిర్వహణలో జరిగింది ముఖ్య అతిథిగా గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి పాల్గొని అరణ్య శతకం ఆవిష్కరణ చేసి మాట్లాడారు ఇప్పటి వరకూ ఏభై శతకాలు అధ్యాత్మిక భావనలు అంశాలు గా రాసిన శంకర నారాయణ అరణ్య శతకం పర్యావరణ ను ప్రకృతి నీ కాపాడేందుకు అరణ్యాల అవసరం తెలుపుతూ శతక పద్యాలు రాసారని వివ రించారు అడవి తల్లి నీ అమృత వల్లి గా భావించటం అర్ధవంతం గా ఉందని ఉదాహరించారు వేదిక పై శంకర నారాయణ తన సంపుటిని ప్రముఖ రచయిత్రి అటవీ శాఖ ఉన్నత అధికారి దేవనపల్లి వీణా పాణి కి లాంఛనం గా అంకిత మిచ్చారు వీణా పాణి మాట్లాడుతూ శంకర నారాయణ తనకు చెప్పిన విధం గా పది పదిహేను రోజులలో అడవులు ను అంశం గా గ్రహించి వంద పద్యాలు రాయడం ఆయనకు భాష పై ఉన్న సాధికారత కి నిదర్శనం అన్నారు సులభ శైలి లో వున్న అరణ్య శతకం ప్రతి ఒక్కరూ చదివి అడవులు ప్రాధాన్యత అర్థం చేసుకోవలనీ కోరారు శంకర నారాయణ మాట్లాడుతూ వంద శతకాలు రాయటం తన లక్ష్యం అని చెప్పారు కుక్కను పెంచే వాడు మనిషి మొక్క ను పెంచే వాడు మహర్షి అనే స్పూర్తి తో అరణ్య శతకం రాశానని తెలిపారు వేదిక పై బాల సాహితీ రచయిత చొక్కాపూ రమణ సిని దర్శకుడు మల్లం రమేష్ పాల్గొన్నారు










