హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17: మాణికేశ్వరి నగర్లోని కింగ్ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ అన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ డీసీసీ కార్యదర్శి బోధాస్ నర్సింహ, వెంకటేష్, సుదర్శన్, గోవింద్, నరేష్, శివరాజ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
కింగ్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక యువకులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





