హైదరాబాద్,రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26:
గోవాడ క్రియేషన్స్ థియేటర్ గ్రూప్ కళాకారులు డా. వెంకట్ గోవాడ దర్శకత్వంలో సిద్ధార్ధుని జీవితం తొలి భాగం సత్యాన్వేషి నాటక ప్రదర్శనను చిలువేరు రఘురామ్ రచించిన ఈ నాటక తొలి ప్రదర్శనను కళావిపంచి బొప్పన నరసింహారావు ఆధ్వర్యంలో డా.వెంకట్ గోవాడ దర్శకత్వంలో రవీంద్రభారతిలో ప్రదర్శించారు. ప్రిన్స్ సిద్ధార్ధుడు గౌతమ బుద్ధుడిగా మారడానికి ముందు అతడి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన నాటకం కపిలవస్తు రాజ్యంలో సిద్ధార్థుడి బాల్యం నుంచి మొదలై, సమాజంలోని ఘర్షణలు, బాధలు, మరణాలు చూసి చలించిపోవడం, భార్య యశోధర, కుమారుడు రాహుల్ ను ప్రాపంచిక బంధాలను వీడి మానవ జాతి దుఃఖాలకు కారణాలు వెతుక్కుంటూ సత్యం కోసం అన్వేషిస్తూ సాగిన ప్రయాణమే ఈ నాటకం.








