ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం10 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:22 pm

గురువారం

10 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:22 pm

SENSEX74,743-2.32%
NIFTY23,421-2.00%
హైదరాబాద్ 22K₹1,45,595/10g-0.89%
హైదరాబాద్ 24K₹1,58,831/10g-0.89%
వెండి₹2,24,890/kg+1.52%

తాజా వార్తలు

బడిపిల్లల కష్టాలు తీర్చిన సర్పంచ్ 'సైకిల్' బాసట! మాట నిలబెట్టుకున్న సర్పంచ్ నాతాల వెంకట్‌రెడ్డి

Gajula Malkapuram Sarpanch Nathaala Venkat Reddy won praise by donating bicycles from his own pocket to poor students struggling to walk long distances to school.

nagendra10 September 2026, 1:49 AM0 చూసులుtrinetnews.com
బడిపిల్లల కష్టాలు తీర్చిన సర్పంచ్ 'సైకిల్' బాసట!  మాట నిలబెట్టుకున్న సర్పంచ్ నాతాల వెంకట్‌రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నలుగురు విద్యార్థులకు సొంత ఖర్చులతో సైకిళ్ల పంపిణీ

"ప్రతి ఏటా ఉచితంగా సైకిళ్లు అందిస్తా" - సర్పంచ్ సరికొత్త హామీ

ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి అరుదైన చొరవ

సూర్యాపేట, పెన్ పహాడ్, ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్ 9:

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ స్థానిక సర్పంచ్ నాతాల వెంకట్‌రెడ్డి అరుదైన ఉదారతను చాటుకున్నారు. మండల పరిధిలోని గాజుల మల్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పాఠశాలలో చదవడానికి ప్రతిరోజూ సుమారు 7 కిలోమీటర్ల దూరం నుండి కాలినడకన ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న నలుగురు పేద విద్యార్థులను సర్పంచ్ గుర్తించారు. రవాణా కష్టాల వల్ల విద్యార్థులు బడికి దూరం కాకూడదనే ఉద్దేశంతో, ఒక్కొక్కటి రూ. 6,000 చొప్పున మొత్తం రూ. 24,000 విలువైన నాలుగు సైకిళ్లను తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసి బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాతాల వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దూర భారం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదనే ఈ చిన్న సహాయం చేశానని తెలిపారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా దూరం నుండి వచ్చే పేద విద్యార్థులను గుర్తించి, వారికి సొంత ఖర్చులతో సైకిళ్లను పంపిణీ చేస్తానని ఈ వేదికగా ఆయన సంచలన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు. హెచ్‌ఎం చేకూరి అంజయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల కష్టాన్ని గుర్తించి సకాలంలో స్పందించిన సర్పంచ్ చొరవ అందరికీ స్పూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి రామకృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి లావణ్య, డాక్టర్ కవిత, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు మంజుల, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీరాములు, విద్యార్థుల తల్లిదండ్రులు భూక్య వెంకటేశ్వర్లు, గుగులోతు సురేష్, వెంకన్న, నిర్మల, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఖప్రాయపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నూనెముంతల బుచ్చి రాములు గౌడ్ మృతి చెందగా, వారి కుటుంబాన్ని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బుచ్చి రాములు గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మిగతా చదవండి →

అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

Former Government Whip Gongidi Sunitha Mahender Reddy visited Yemme Kalyan, who is receiving treatment at Apex Hospital in Boduppal following an accident.

మిగతా చదవండి →