ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు10:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం పుల్లాయగూడెం గ్రామం మహిళా సంఘాలకు సొంత భవనం కల్పించే దిశగా గ్రామంలో కీలక అడుగు పడింది. గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి గురువారం రోజు సర్పంచ్ నర్రాముల రామలింగయ్య యాదవ్ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి స్థలాన్ని మాజీ సర్పంచ్ పెసరు గిరిజ గోపాల్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి తడిసిన మల్లారెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈ మల్లేష్,ఉప సర్పంచ్ తండ రమేష్ గౌడ్,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,వార్డు సభ్యులు,గ్రామస్తులు,మహిళా సంఘాల సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు





