అంబర్ పేట్, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 18 :
తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలు అంబర్ పేట్ గౌడ సంఘం ఆధ్వర్యంలో అంబర్ పేట్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీహెచ్ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలు, సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాపన్న గౌడ్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అందరివాడని ఆయన జన్మదిన వేడుకలు అన్ని వర్గాలవారు చేయాలని సూచించారు.





