అంబర్ పేట్, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 17 : సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను 18వ తేదీ
గౌడ సంఘం ఆధ్వర్యంలో అంబర్పేట్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు సంఘం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ బీసీ సలహాదారు వి. హనుమంతరావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్రావు తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గంలోని గౌడ కులస్తులు, బంధువులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గౌడ సంఘం కమిటీ సభ్యులు కోరారు.
ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు పంజాల గిరిధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తోలుపు నూరి
కృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీహరి గౌడ్, మల్లికార్జున్ గౌడ్ తదితరులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.





