హైదరాబాద్, రవీంద్రభారతి, హైదరాబాద్ ట్రైనెట్ న్యూస్ 9 :
అక్ష్యాద స్కూల్ ఆఫ్ ఫెర్ఫార్మె న్స్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నాట్య గురువు నిహంత్రి రెడ్డి శిష్యురాలు సహస్రరెడ్డి కూచిపూడి అరంగేట్ర ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. నర్తకి సహస్ర ప్రణయం, వేదరి శిఖర తరంగం వంటి పలు అంశాలపై సాగిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద, సినీనటుడు తనికెళ్ళ భరణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సహస్ర రెడ్డి చిన్నతనం నుంచే
శాస్త్రీయ నృత్య కళలను అభ్యసించడం అభినందనీయమన్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ప్రదర్శించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.లక్మారెడ్డి, మల్లారెడ్డి కాలేజీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.








