ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం8 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:24 pm

మంగళవారం

8 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:24 pm

SENSEX76,133-0.57%
NIFTY23,684-0.96%
హైదరాబాద్ 22K₹1,45,467/10g+2.96%
హైదరాబాద్ 24K₹1,58,691/10g+2.96%
వెండి₹2,21,904/kg+4.50%

తాజా వార్తలు

రుద్ర-శివ సాంస్కృతిక సంస్థ 13వ వార్షికోత్సవ వేడుకలు నెల్లుట్ల రవీందర్‌రావుకు ‘రుద్ర-శివ జాతీయ ప్రతిభా పురస్కారం’

The 13th-anniversary celebrations of the Rudra-Shiva Cultural Organization will be held grandly in Hyderabad, featuring prestigious awards, a musical night, and a drama performance.

nagendra8 September 2026, 2:17 AM0 చూసులుtrinetnews.com
రుద్ర-శివ సాంస్కృతిక సంస్థ 13వ వార్షికోత్సవ వేడుకలు  నెల్లుట్ల రవీందర్‌రావుకు ‘రుద్ర-శివ జాతీయ ప్రతిభా పురస్కారం’

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

సంగీత విభావరి, శ్రీకృష్ణ రాయబారం నాటక ప్రదర్శన

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7:

రుద్ర-శివ సాంస్కృతిక సంస్థ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవాన్ని సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖులు, కళాకారులు, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రతిభావంతులను సత్కరించనున్నారు.

కార్యక్రమంలో భాగంగా నెల్లుట్ల రవీందర్‌రావుకు ‘రుద్ర-శివ జాతీయ ప్రతిభా పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. పలువురు ప్రముఖులు, సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన విశిష్ట అతిథులు సభా కార్యక్రమంలో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు సంగీత విభావరి నిర్వహించనుండగా, అనంతరం ‘శ్రీకృష్ణ రాయబారం’ పూర్తి నాటకాన్ని ప్రదర్శించనున్నారు. రాత్రి 8 గంటలకు ముఖ్య అతిథుల సమక్షంలో సభా కార్యక్రమం, ప్రతిభా పురస్కారాల ప్రదానం జరగనుంది.

చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాల్‌లో సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కళాభిమానులు, సాహితీవేత్తలు, సంగీత ప్రియులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రుద్ర-శివ సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు కోరారు.

ఇవి కూడా చదవండి

సీఎం క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు చావు డప్పు కొడుతున్నారు: బిఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి

సీఎం క్షమాపణ చెప్పాలి  కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు చావు డప్పు కొడుతున్నారు: బిఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి

BRS leader Kalluri Ramachandra Reddy demanded that Chief Minister Revanth Reddy apologize for governance failures, stating the public is turning against Congress.

మిగతా చదవండి →