నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17 : గణేష్ సురక్ష సంకల్ప్- 2026 లో భాగంగా ‘మెరుగైన భవిష్యత్తు కోసం సంకల్పం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మల్లాపూర్ ఎన్ ఎఫ్ సి యువసేన ఆధ్వర్యంలో ఎన్ ఎఫ్ సి కాలనీలోని గణేష్ మండపాల వద్ద రోడ్ సేఫ్టీపై ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి రోడ్ సేఫ్టీ డీసీపీ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్, ట్రాఫిక్ సీఐ శ్రీ నాగరాజు, రోడ్ సేఫ్టీ సీఐ ప్రదీప్ కుమార్, డీఐ వరుణ్ కాంత్ రెడ్డి, ఎస్ఐ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులు, యువత, స్థానిక ప్రజలతో అధికారులు మాట్లాడారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం, తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, వేగాన్ని నియంత్రించడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. గణేష్ ఉత్సవాల సమయంలో ప్రజలు, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
గణేష్ మండపాల వద్ద రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం..
Traffic police organized a road safety awareness program at Ganesha pandals in Nacharam as part of the Ganesh Suraksha Sankalp-2026 initiative.
nagendra17 September 2026, 11:41 PM1 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ 77వ ఆవిర్భావ దినోత్సవం

ఏఐ జర్నలిజం పుస్తక రచయిత ముద్దం నరసింహస్వామిని సత్కరించిన ఎన్ఎఫ్ఎస్యూ వీసీ

NFSU Vice Chancellor Dr. J.M. Vyas felicitated technical journalism expert Muddam Narasimha Swamy, author of 'Artificial Intelligence in Modern Journalism'.
మిగతా చదవండి →ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు

తెలంగాణ క్రీడా శక్తిని మరింత బలోపేతం చేద్దాం ఎల్. బి.స్టేడియంలోఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

Praja Palana Day celebrations were grandly held at LB Stadium under the auspices of the Sports Authority of Telangana, with a call to make the state a leader in sports.
మిగతా చదవండి →