ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు07/
స్టేట్,సెంట్రల్ పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుపేద విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూత్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహణ నిర్ణయం అందరికీ తెలిసిందే దానిలో సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వస్తున్న నోటిఫికేషన్స్, ఎలా చదవాలి,గ్రౌండ్ ప్రాక్టీస్ ఎలా చేస్తే మెరిట్ వస్తుంది అనే అనేకరకాల అంశాలను, సమస్యలను పరిష్కరిస్తూ తమదైన శైలిలో విద్యార్థులకు వాట్సాప్ మాధ్యమం ద్వారా ఉచిత ట్రైనింగ్ ఇస్తూ ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా నిస్వార్ధంగా ప్రభుత్వం చేయలేని అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి దాదాపు 200 మంది వరకి ఉద్యోగాలను సాధించడంలో విశేష కృషి చేశారు అని అలాంటి సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ సభ్యులకు ప్రభుత్వం ఏర్పాటు చేసే యూత్ ట్రైనింగ్ సెంటర్ లో ఉద్యోగ అవకాశాన్ని,సైనిక గ్రూప్ ద్వారా ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుపేద విద్యార్థులకు ఆ సెంటర్లో చదువుకోవడానికి,సంస్థ సేవల ప్రభుత్వం గుర్తించి ఇంకొంతమంది దేశానికి సైనికులను తయారు చేయడంలో మాకు సహకరించాలి అని ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకి సంస్థ తరపున వినతిపత్రం అందజేయడం జరిగింది దానికి వారు మీరు చేస్తున్న ఈ బృహత్కర కార్యానికి మావంతుగా ప్రభుత్వం ద్వారా,స్వతహాగా సహకరిస్తాము అని మీరు కోరినట్టు ట్రైనింగ్ సెంటర్ లో అవకాశాలను కల్పిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగం చేస్తూనే గ్రామీణ ప్రాంతాల్లోని యువతను తనదైన శైలిలో ప్రోత్సహిస్తు ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దే ప్రసాద్ ముదిరాజ్ ను ఎంఎల్ఏ అభినందించారు.ఈ కార్యక్రమంలో సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ ఫౌండర్ & జనరల్ సెక్రటరీ బండారి ప్రసాద్ ముదిరాజ్ గారు,స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.





