చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 15 : స్వాత్రంత్ర దినోత్సవం సందర్భంగా సెవెన్ హిల్స్ సాంస్కృతిక సంఘసేవా సంస్థ ఆధ్వర్యంలో 'సెవెన్ హిల్స్ సినీ సంగీత విభావరి' త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవరస గాయని ఆమిని పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రముఖ సంఘసేవకులు డాక్టర్ కటకం భాస్కర్ గుప్తా పాల్గొని గాయకులను అభినందించారు.
ఈ సందర్భంగా సీనియర్ గాయనీ గాయకులు, సంఘసేవకులు గంటి రామకృష్ణ, శైలజ జంట పాల్గొన్నారు. అనంతరం గాయని శ్రీరాజికి "స్వర రాణి" బిరుదును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గాయనీ గాయకులు ఆనంద్ లక్ష్మి, లక్ష్మిప్రియశ్రీ, జ్యోతి, వాసు,
మధురమైన సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ వి. ఏడుకొండలరావు, సెక్రటరీ వి. లక్ష్మి పాల్గొన్నారు .






