చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 20 : శ్రీశారద మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో శారద నిర్వహణలో "శ్రీ వేంకటేశ దయా సాగరా..." పేరిట తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి అతిధులుగా లలిత కళా పోషకులు, కె.వి.ఆర్. మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు
సీహెచ్. శ్రీనివాసరావు, అన్నమయ్య పదాకోకిల డా. శోభారాజు, అఖిలభారత ఎన్టీఆర్ బ్రదర్స్ అధ్యక్షుడు
జె.యం.కె. నాయుడు,
సీనియర్ సూపరింటెండెంట్, పిజి కాలేజ్ ఆఫ్ లా పి.జి.విజయలక్ష్మి కుమారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ భానుమతి అవార్డు గ్రహీత, ప్రముఖ గాయని అచ్యుతకు 'పద్మభూషణ్ పి.లీల సంగీత పురస్కారం-2026' అందజేశారు.
సభ ముందు ప్రముఖ గాయనీ శారద నిర్వహణలో గాయనీ , గాయకులు 'స్వరసిద్ధ గాత్ర' డి.ఎ. మిత్ర, నేపథ్య గాయకులు చంద్రతేజ్. తాతా హనుమంత రావు, వేణుగోపాల్ రావు, శ్రీశైల శ్రీనివాస్, ఎం.ఎన్.ఎస్. స్వామి, జి.ప్రకాష్ రెడ్డి, శ్రీ రాములు, బాలకృష్ణ, శ్రీ పి.కృష్ణమోహన్.
కళ్యాణి దేశ్పాండే, దివిడి నాగమణి, అరుణ, డి.సీత, వాణిశ్రీ, పి. సీతామహాలక్ష్మి ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.









