హైదరాబాద్, నాంపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26:
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన "మేరా భారత్ మహాాన్ డాన్స్ ఫెస్ట్" కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గాయకుడు, చిత్రకారుడు
జిహెచ్ఎంసి రిటైర్డ్ ఏసిపి రవిమన్యుకు ప్రైడ్ ఆఫ్ ఇండియా'అవార్డును
హార్టికల్చర్. అసిస్టెంట్ డైరెక్టర్
డి. చక్రపాణి ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వవివిధ రంగాలలో సేవలందించిన వారిని గుర్తించి అవార్డులను ప్రదానం చేయడం అభినందనీయమన్నారు.
రవిమన్యు గాయకునిగా, చిత్రకారునిగా ఆయన అందిస్తున్న సేవలు చిరస్మరణీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షించారు.





