హైదరాబాద్ , ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 28 :
అన్నాచెల్లెళ్లు అనుబంధానికి ప్రతీక రాఖి అని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. రాఖి పండుగ సందర్భంగా బిఆర్ఎస్ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ,
మహిళ నాయకురాలు గొంగిండి సంతోషి
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్లు, తోబుట్టువుల మధ్య ఉన్న పవిత్ర ప్రేమకు, బంధానికి చిహ్నంగా జరుపుకునే అతి ముఖ్యమైన హిందూ పండుగ రక్షాబంధన్ రాఖీ పండుగ అని పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కు పలువురు మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున
సోదరి తన అన్నయ్య కు, తమ్ముడి చేతికి రక్షా సూత్రం (రాఖీ) కట్టి, అతనికి ఆయురారోగ్యాలు, అదృష్టం కలగాలని కోరుకుంటారని తెలిపారు.




