రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్ , ఎస్పీ మహేష్ బి. గీతే గార్లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు..
అనంతరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శకటాలను ఆసక్తిగా తిలకించి, జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
అలాగే వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకున్నారు.





